Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయితో టీటీఈ అసభ్యప్రవర్తన - చెప్పుదెబ్బలు

ఆర్ఏసీ టిక్కెట్‌పై ప్రయాణం చేసేందుకు జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఓ అమ్మాయి పట్ల టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి అపర కాళిమాతగా మారి టీటీఈని చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించింది. దీంతో ఆ

బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయితో టీటీఈ అసభ్యప్రవర్తన - చెప్పుదెబ్బలు
, శుక్రవారం, 13 జులై 2018 (09:04 IST)
ఆర్ఏసీ టిక్కెట్‌పై ప్రయాణం చేసేందుకు జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఓ అమ్మాయి పట్ల టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి అపర కాళిమాతగా మారి టీటీఈని చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించింది. దీంతో ఆ టీటీఈపై రైల్వే అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఆగ్రాకు చెందిన 18 యేళ్ల ఓ అమ్మాయి ఆర్ఏసీ టికెట్‌పై అలహాబాద్- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. తెల్లవారుజామున 2 గంటలకు తనిఖీలకు వచ్చిన టీటీఈ నానక్ సింగ్ (50) వద్ద.. తనకు బెర్తు కేటాయించాలని అమ్మాయి కోరింది. బీ3 కోచ్‌లో తనకు కేటాయించిన బెర్తులో పడుకోమని టీటీఈ అమ్మాయిని పంపించాడు. 
 
ఆ తర్వాత అన్ని బోగీల్లో టికెట్ల తనిఖీలు పూర్తయ్యాక తన బెర్తు వద్దకు వచ్చిన టీటీఈ బెర్తులు ఖాళీ లేవని తన బెర్తునే షేర్ చేసుకుందామని అమ్మాయికి చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి సమ్మతించింది. ఆ తర్వాత రైలు బోగిలోని లైట్లన్నీ ఆర్పేసిన టీటీఈ నానక్ సింగ్ తన బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి.. టీటీఈని చెప్పుతో కొట్టి... రైల్వే పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. దీంతో రైలు కాన్పూర్ రైల్వే స్టేషనులో ఆగగానే టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి ఫిర్యాదు మేర రైల్వే ఉన్నతాధికారులు కీచకుడైన టీటీఈ నానక్ సింగ్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి కిరణ్‌... ముహూర్తం ఉదయం 11.30