Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?

ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,

నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?
, శుక్రవారం, 13 జులై 2018 (13:07 IST)
ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్ష్మణ్ అనే యువకుడు స్నేహితులతో కలసి చిట్టినగర్‌లో ఉన్న ఓ పాఠశాల మైదానానికి వచ్చి క్రికెట్ ఆడేవాడు. ఆ సమయంలో మైదానం పక్కనే ఉంటూ, అక్కడి మరో స్కూల్‌లో పనిచేస్తున్న ఓ యువతి (20)పై లక్ష్మణ్ కన్ను పడింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నయ్యతోనే ఆ యువతి కలిసివుంటోంది.
 
ఈ క్రమంలో మంచినీళ్లతో ప్రారంభమైన వారి పరిచయం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, మెసేజ్‌ల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి, వారు బయటకు వెళ్లారని అంటూ, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేసి వీడియో తీశాడు. బయటకుచెబితే, వీడియోలు బయట పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 
 
ఆపై పలుమార్లు సినిమాలకు, షికార్లకూ తిప్పి ఆమెను అనుభవించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తేగానే తప్పించుకోవడం మొదలు పెట్టాడు. కనిపించకుండా పోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన ఉంపుడుగత్తెల్లో భారతీయ మహిళలే ఎక్కువ : ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య