Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు.. పిల్లలను కాలువలో పడేశాడు..

Webdunia
గురువారం, 27 మే 2021 (22:22 IST)
క్షణికావేశాలు మానవీయ సంబంధాలను మంటగలిపేస్తున్నాయి. చిన్న చిన్న కారణాల కోసం జనాలు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా యూపీకి చెందిన ఓ కిరాతకుడు భార్య శృంగారానికి నిరాకరించిందని కాల్చి చంపేశాడు. అంతేకాదు ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలను ఓ కాలవలోకి తోసేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ముజఫరానగర్‌కు సమీపంలో గల బసేదీ గ్రామానికి చెందిన పప్పూ కుమార్ గత మంగళవారం (37) తన భార్య డాలీ (36), పిల్లలు సోనియా (5), వంశ్ (3), హర్షిత (15 నెలలు)లను చంపేసి పరారయ్యాడు.
 
స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పప్పూ కుమార్‌ను అరెస్ట్ చేశారు. 15 రోజుల నుంచి శృంగారానికి నిరాకరిస్తోందనే కారణంతోనే తన భార్యను చంపేశానని పోలీసుల విచారణలో పప్పూ చెప్పాడు. అదే కోపంలో పిల్లలను ఓ కాలువలోకి తోసేసినట్టు చెప్పాడు. పిల్లల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments