Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించనున్నారా?

Webdunia
గురువారం, 27 మే 2021 (22:15 IST)
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తోంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని వెల్లడైంది. అంటే ఒక ఏడాదిలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణీ నుంచి తప్పుకున్నాయని అర్థమవుతోంది.
 
అయితే ఈ నోట్లు చలామణీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణాలేమిటో తెలియడం లేదు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో నగదు డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.500 నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లలో రూ.500 నోట్ల వాటా 68.4 శాతం. ఇది గత ఏడాది 60.8 శాతంగా ఉండేది.
 
రూ.2,000 నోట్లను అక్రమంగా దాచుకోవడం సులువుగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లభ్యతను మెరుగుపరచడంలో ఈ నోట్లు ఉపయోగపడినట్లు కొందరు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments