Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోపుడు బండి వస్త్ర వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 జులై 2022 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండిపై వస్త్రాలు అమ్ముకుంటూ పొట్టపోసుకునే ఓ చిరు వ్యాపారికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. వారిద్దరూ తుపాకీలు చేతబట్టి ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఆయన వీధి వీధి తిరుగుతూ వస్త్రాల విక్రయిస్తుంటే ఆ సాయుధ బాడీగార్డులు ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఎటా జిల్లా చెందిన రామేశ్వర్‌ దయాల్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుగేంద్ర నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
మరోవైపు, తనకు పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments