Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురాద్ నగర్ ఘటన కారకులపై ఎన్.ఎస్.సి కింద చర్యలు : సీఎం యోగి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:59 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లో మురాద్ నగర్‌లో జనవరి 3న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. 
 
ఈ మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఘటనకు కారకులైన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
కాగా… ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనేందుకు బంధవులంతా శ్మశాన వాటికకు వచ్చారు. అదేసమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా ఆ శ్మశాన వాటికలో ఉన్న కాంప్లెక్స్ గ్యాలరీలో తలదాచుకున్నారు. 
 
అయితే అది కొత్తగా నిర్మించినది కావడం, భారీ వర్షం కారణంగా పూర్తిగా నానడంతో గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో దానికింత తలదాచుకున్న వారంతా అందులో చిక్కుపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments