Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలను అడ్డుకుంటే రాష్ట్రం తగలబడిపోతుంది: విష్ణువర్ధన్‌ రెడ్డి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:55 IST)
విజయనగరం జిల్లా రామతీర్థం సందర్శనకు బయలుదేరిన బీజేపీ నేతలను అడ్డుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలని రామతీర్థంకు అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని హెచ్చరించారు.
 
జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలన్నారు. రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసీపీని అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండని ఆయన యెద్దేవా చేశారు. 
 
పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా.. లేక రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఏపీలో మనవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. 60ఏళ్ల వయసున్న సోమువీర్రాజుని అరెస్ట్ చేయడం జగన్ పరికిపంద చర్యగా వ్యాఖ్యానించారు. 
 
ఏపీలో పోలీసుల ప్రభుత్వం నడుస్తోందని.. పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments