Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో మృతశిశువు!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో ఓ మృతశిశువును వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఖుషీ నగర్‌లోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అనేక మంది వైద్యుల వద్ద చూపించారు. కానీ, ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా, మూఢనమ్మకం కలిగిన ఆ బాలిక తల్లిదండ్రులు వివిధ రకాల మంత్రాలు, తంత్రాలు చేయిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి అధికం కావడంతో మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలికకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో ఆ బాలిక కడుపులో ఉన్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్లు ఉన్న ఓ మృతశిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో ఇకపై ఆ బాలిక తోటివారిలాగే సాఫీగా జీవితాన్ని గడపొచ్చని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments