Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో మృతశిశువు!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో ఓ మృతశిశువును వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఖుషీ నగర్‌లోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అనేక మంది వైద్యుల వద్ద చూపించారు. కానీ, ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా, మూఢనమ్మకం కలిగిన ఆ బాలిక తల్లిదండ్రులు వివిధ రకాల మంత్రాలు, తంత్రాలు చేయిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి అధికం కావడంతో మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలికకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో ఆ బాలిక కడుపులో ఉన్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్లు ఉన్న ఓ మృతశిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో ఇకపై ఆ బాలిక తోటివారిలాగే సాఫీగా జీవితాన్ని గడపొచ్చని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments