Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి చెరకుతోటలోకి లాక్కెళ్లి.... నాలుక కోసి అత్యాచారం...

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేసి కేకలు పెట్టకుండా ఉండేందుకు నాలుకను కత్తిరించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు కామాంధులు బలవంతంగా చెరకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమె నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. 
 
అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. త‌మ కూతురు ఇంటి వద్ద క‌న‌బ‌డ‌క‌పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. చెరుకు తోటల్లో ఆమె మృతదేహం ఉందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. దండగులు ఆమె క‌ళ్ల‌ను పీకేసినట్లు ఆ బాలిక తండ్రి అంటున్నాడు. 
 
అయితే, ఆ బాలిక క‌ళ్ల‌ను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments