Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మత్తు మందు ఇచ్చి దాడి.. 14 ఏళ్ల బాలిక మృతి.. 70మంది వద్ద విచారణ

మత్తు మందు ఇచ్చి దాడి.. 14 ఏళ్ల బాలిక మృతి.. 70మంది వద్ద విచారణ
, శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:56 IST)
14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆశ్రమ నిర్వాహకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి వార్డెన్ కూడా సహకరించాడు. ఈ ఘటనకు సంబంధించి చేస్తోన్న విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మైనర్ బాలికపై సైతం నిందితుడు వేణుగోపాల్ లైంగికదాడి పాల్పడినట్లు సమాచారం. 
 
దీనిపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాహకులు బెదిరింపులకు తెగబడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో వీరు అక్రమాలకు తెగబడినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో రెస్కూ చేసిన మైనర్లను ఇక్కడికే పంపాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారని సమాచారం. 
 
ఈ ఘటనపై వేసిన హైపవర్ కమిటీ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అనాధ ఆశ్రమంలోని 70మందిని అధికారులు విచారించనున్నారు. రాష్ట్రంలోని ఇతర అనాధ ఆశ్రమాలలో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 అనాధ ఆశ్రమాలు, 19వేల మంది అనాధలు ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ విజృంభణ.. 7లక్షల మంది మృతి.. నాలుగో స్థానంలో భారత్