Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో జీన్స్ ప్యాంటులో బంగారం.. వ్యక్తి అరెస్ట్

Advertiesment
Customs officials
, బుధవారం, 5 ఆగస్టు 2020 (19:16 IST)
తమిళనాడులోని చెన్నైలో జీన్స్ ప్యాంటులో బంగారాన్ని దాచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. 
 
బంగారాన్ని పేస్టుగా చేసి సన్నని కవర్లలో ఉంచి జీన్స్‌ ప్యాంటులోని బెల్ట్‌ భాగం వద్ద దాచిన విషయాన్ని వారు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 731 గ్రాముల బంగారం ముద్ద విలువ రూ.34.5 లక్షలని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలలో 9 బిలియన్ వీడియోలను వీక్షించిన భారతీయ వీడియో యాప్ మిత్రోన్