Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కును తెగనమ్మడం ఖాయం : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:58 IST)
ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును తెగనమ్మడం ఖాయమని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదా విలీనం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. 
 
అయితే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఖరారు సమయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన మిగులు భూములు, అప్రధానమైన ఆస్తులను పక్కకు పెట్టే విషయం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 
 
విశాఖ ఉక్కు ప్లాంట్ అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగింది. నిర్దిష్ట అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని,  అవసరమైనప్పడు దాని మద్దతు కూడా కోరతామన్నారు. 
 
విశాఖ ఉక్కులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించిందని.. ఇందుకోసం విధి విధానాలను రూపొందించేందుకు అంతర్‌ మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 
 
నూతన ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం.. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేయడమో, లేక మరో సంస్థలో విలీనం చేయడమో జరుగుతుందని వివరించారు. ప్రైవేటీకరణ సాధ్యం కాకుంటే వాటిని మూసివేసే విషయం కూడా పరిశీలిస్తామని మంత్రి అనురాగ్ ఠాగూరు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments