Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏఏను వ్యతిరేకించే వారంతా దళిత వ్యతిరేకులే : అమిత్ షా

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:33 IST)
పౌరసత్వ సవరణ బిల్లు మూలంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆరంభంలో ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లు చిచ్చు రేపినా క్రమేపీ పశ్చిబెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 
 
అయితే ఈ చట్టం ముస్లిం వ్యతిరేక చట్టం అని నిరూపించమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందున రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీల మీద ఆయన మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకించే వారంతా దళిత వ్యతిరేకులని, పేదరిక వ్యతిరేకులని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 
 
సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్నాటకలోని హుబ్లీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త చట్టం వలన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వచ్చే శరణార్థులలో 70 శాతం దళితులని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని అంతేకానీ దేశాన్ని లేనిపోని అబద్దాలు అసత్యాలతో విడదీయ కూడదని హితవు పలికారు. ప్రతిపక్షాలు ఎన్నివిమర్శలు చేసినా భారతీయ ఆత్మ విడిపోదని అమిత్ షా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments