Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యంత శాంతి యుత ప్రాంతం ఇప్పుడు కాశ్మీర్ : జి. కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:29 IST)
గణతంత్ర దినోత్సవం రోజున భారత మాతకు హారతి ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి దేశంలోపల, సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందన్నారు. అనవసరంగా ఒక మతాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈనెల 18 నుంచి 24 వ తేదీ వరకు కేంద్ర మంత్రులు జమ్మూ కాశ్మీర్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు.
 
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర మంత్రులు కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంతేకాదు రాత్రి అక్కడ గ్రామాల్లో బస చేస్తారని తెలియజేశారు. దేశంలో అత్యంత శాంతి యుత ఏదైనా ఉందా అంటే ? అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments