Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై: శానిటైజ్ చేస్తానంటూ ఏటీఎంలో రూ.8లక్షల చోరీ..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (18:18 IST)
కరోనా వైరస్ కారణంగా చోరీలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట నిలబడ్డాడు.
 
లోపలికి వెళ్లిన నిందితుడు దొంగతనం మొదలెట్టాడు. ఇంతలో మరో వినియోగదారుడు ఏటీఎంలోని వెళ్లాడు. దొంగ డబ్బు కట్టలను సర్దుతుండగా అతడిని బ్యాంకు అధికారి అని పొరబడి బయటకి వచ్చేశాడు. దీంతో దొంగ రూ. 8.2 లక్షలతో బయటికి వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి పారిపోయాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డుకు చెప్పాడు.
 
ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చోరి జరిగిన తీరు బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments