Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై: శానిటైజ్ చేస్తానంటూ ఏటీఎంలో రూ.8లక్షల చోరీ..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (18:18 IST)
కరోనా వైరస్ కారణంగా చోరీలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట నిలబడ్డాడు.
 
లోపలికి వెళ్లిన నిందితుడు దొంగతనం మొదలెట్టాడు. ఇంతలో మరో వినియోగదారుడు ఏటీఎంలోని వెళ్లాడు. దొంగ డబ్బు కట్టలను సర్దుతుండగా అతడిని బ్యాంకు అధికారి అని పొరబడి బయటకి వచ్చేశాడు. దీంతో దొంగ రూ. 8.2 లక్షలతో బయటికి వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి పారిపోయాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డుకు చెప్పాడు.
 
ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చోరి జరిగిన తీరు బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments