Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై: శానిటైజ్ చేస్తానంటూ ఏటీఎంలో రూ.8లక్షల చోరీ..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (18:18 IST)
కరోనా వైరస్ కారణంగా చోరీలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట నిలబడ్డాడు.
 
లోపలికి వెళ్లిన నిందితుడు దొంగతనం మొదలెట్టాడు. ఇంతలో మరో వినియోగదారుడు ఏటీఎంలోని వెళ్లాడు. దొంగ డబ్బు కట్టలను సర్దుతుండగా అతడిని బ్యాంకు అధికారి అని పొరబడి బయటకి వచ్చేశాడు. దీంతో దొంగ రూ. 8.2 లక్షలతో బయటికి వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి పారిపోయాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డుకు చెప్పాడు.
 
ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చోరి జరిగిన తీరు బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments