Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీరో నాలెడ్జ్ ఉన్నోళ్లు కూడా సీఎం కావాలనుకుంటే ఎలా? రాందాస్ అథవాలే

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (07:03 IST)
రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేనివాళ్లు అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్లు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ దేశం ఎక్కడికి పోతుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మహారాష్ట్రలో 50-50 ఫార్ములా ప్రకారం తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
 
దీనిపై బీజేపీకి మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ఎలాంటి అనుభవం లేదని... అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడం మనందరికీ సిగ్గు చేటని అన్నారు.
 
బీజేపీకి చెందిన వ్యక్తే సీఎం కావాలని, దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎంగా మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు ఉన్న కూటమికి క్లియర్ మెజార్టీ వచ్చిందని... బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవిస్‌ను ఎన్నుకున్నారని చెప్పారు. ఫడ్నవిస్ సీఎం కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. మహారాష్ట్రకు ఐదేళ్ళపాటు ఒకే ముఖ్యమంత్రి ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. 
 
పైగా, బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని శివసేన గుర్తుంచుకోవాలని అథవాలే చెప్పారు. ఇతర పదవుల కోసం శివసేన డిమాండ్ చేయవచ్చని... ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అంశంపై బీజేపీ ఆలోచించాలని సూచించారు. మరో ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నట్టు ఫడ్నవిస్ ఇప్పటికే ప్రకటించారని... ఈ నేపథ్యంలో, శివసేన రాజీ పడాల్సిన అవసరం ఉందని రాందాస్ అథవాలే చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments