Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ ఠాక్రే - ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:41 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో పదవీ గండం నుంచి తప్పించుకున్నారు. అదేసమయంలో ఆయన సోమవారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
మహారాష్ట్ర శాసనమండలికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 స్థానాలకు గాను తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో  ఉద్ధవ్ ఠాక్రేతో సహా తొమ్మిది మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ప్రమాణ స్వీకారం చేసినవారిలో సీఎంతో పాటు శివసేన పార్టీ నేత నీలం గోర్హీ, బీజేపీ నేతలు గోపిచంద్ పడాల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సిన్హా మొహిత్  పాటిల్, రమేష్ కరద్‌లు ఉన్నారు. 
 
కాగా, ఇప్పటి వరకు ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే పదవిని వదులుకోవాల్సి వచ్చేది. అయితే, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. మహాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments