Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు హత్య కేసులో మరణ శిక్షలను రద్దు : మద్రాస్ హైకోర్టు తీర్పు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (20:33 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షలను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసి.. వారి శిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుకు మార్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
 
కాగా, రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన దళిత యువకుడు శంకర్ అదే ప్రాంతానికి చెందిన ఓ అగ్ర కులానికి చెందిన కౌసల్యను ప్రేమించాడు. వీరి పెళ్ళికి యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో కౌసల్యను శంకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, వీరిద్దరు మార్చి 2016లో రోడ్డుపై వెళుతుండగా పట్టపగలే బైక్‌పై వెళుతున్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోగా, కౌసల్య స్వల్ప గాయాలతో బయటపడింది. 
 
ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. శంకర్‌పై దాడి చేయించింది కౌసల్య తండ్రి చిన్నస్వామినేనని ఆరోపణలు రావడంతో అతనిని, అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసులో ట్రయల్ కోర్టు 2017లో వీరందరికీ మరణ శిక్షను విధించగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పును సోమవారం వెల్లడించింది. 
 
ఈ తీర్పుపై కౌసల్య స్పందిస్తూ, తనకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు అన్యాయమని, శంకర్ నెత్తుటి మరకల సాక్షిగా ఇది న్యాయం కాదని ఆమె చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments