Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధువులను ఆలయంలోనే హత్య చేశారు.. ఇంతకీ వాళ్లేం చేశారు..?

ఉత్తరప్రదేశ్‌లో సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:07 IST)
ఉత్తరప్రదేశ్‌లో సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఔరైయా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న ముగ్గురు సాధువులను మంచానికి కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆపై కత్తితో పొడిచి మెడను కోశారు. ఈ ఘటలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన సాధువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
ఆలయంలోని సాధువులు హత్యకు గురయ్యారన్న వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఆందోళన చేపట్టారు.  పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీసు బలగాలను దింపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments