Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టులో జనంపైకి దూసుకొచ్చిన ఎద్దు.. ఇద్దరు మృతి!

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:28 IST)
పుదుకొట్టై జిల్లా కల్లూరులో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోటీలను చూస్తున్న జనాలపైకి ఎద్దులు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎద్దు దాడిలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముగిసినా.. ఎక్కడో ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్లూరు సమీపంలో బుధవారం జల్లికట్టు, రెక్లా రేసులు జరిగాయి.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతతో పాటు ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలిచ్చారు. పరుగులు పెడుతున్న ఎద్దులను నిలువరించే క్రమంలో బెదిరిపోయిన ఓ ఎద్దు పోటీలు చూస్తున్న జనంపైకి దూసుకువచ్చింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎద్దుల దాడిలో గాయపడిన వారిని అరంతంగికి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments