Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టులో జనంపైకి దూసుకొచ్చిన ఎద్దు.. ఇద్దరు మృతి!

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:28 IST)
పుదుకొట్టై జిల్లా కల్లూరులో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోటీలను చూస్తున్న జనాలపైకి ఎద్దులు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎద్దు దాడిలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముగిసినా.. ఎక్కడో ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్లూరు సమీపంలో బుధవారం జల్లికట్టు, రెక్లా రేసులు జరిగాయి.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతతో పాటు ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలిచ్చారు. పరుగులు పెడుతున్న ఎద్దులను నిలువరించే క్రమంలో బెదిరిపోయిన ఓ ఎద్దు పోటీలు చూస్తున్న జనంపైకి దూసుకువచ్చింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎద్దుల దాడిలో గాయపడిన వారిని అరంతంగికి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments