Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. పది మంది మృతి

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. పది మంది మృతి
, శనివారం, 30 జనవరి 2021 (11:42 IST)
యుపిలోని మోర్దాబాద్‌ - ఆగ్రా రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ బస్సు - ట్రక్కు   ఢీ  కొన్నాయని, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై యుపి సిఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తనిఖీల్లో 57 కేజీల వెండి, తుపాకి స్వాధీనం... పోలీసులు షాక్..ఎక్కడ?