Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25వేలిచ్చి ప్రియురాలిని సొంతం చేసుకున్నాడు.. భర్త కూడా ఓకే చెప్పాడు.. ఎక్కడ?

పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (14:23 IST)
పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమెను వెతికిపట్టుకున్నారు. అయినా రెండోసారి కూడా పారిపోయింది. చివరికి ప్రియుడితోనే వుంటానని పోలీసులతో చెప్పింది. ప్రియుడు కూడా ఆమెతో వుంటానని చెప్పి అడ్వాన్స్‌గా రూ.25వేలిచ్చి దక్కించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా మనప్పారై ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. బలవంతంగా ఆమెను తల్లిదండ్రులు మేనమామకిచ్చి వివాహం జరిపించారు. అతని నుంచి పారిపోయిన దేవిని పోలీసులు గుర్తించి భర్తకు అప్పగించారు. 
 
అయినా రెండోసారి కూడా ప్రియుడి చెంతకే చేరిపోయింది. చివరికి పోలీసుల పంచాయతీతో దేవి లక్షరూపాయలిస్తే ఆమెను ప్రియుడికి వదిలిపెట్టేస్తానని చెప్పాడు. దీంతో రెండు రోజుల పాటు ముగ్గురికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసుల చర్చలతో వారంతా ఒక అంగీకారానికి వచ్చారు. లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పి, అడ్వాన్స్‌గా రూ.25,000లను చెల్లించి దేవిని తనతో కాపురానికి ప్రియుడు తీసుకెళ్లడంతో వివాదం సమసిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments