Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవాలు.. అలిసిపోయారు.. రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.. అంతే..?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:59 IST)
తమిళనాడు తిరువారూర్‌లో రైలు పట్టాలపై నిద్రిస్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని ముత్తుపేటైలో ఓ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
ఈ ఉత్సవాలకు హాజరైన ముగ్గురు యువకులు రాత్రి అలసట కారణంగా రైల్వే ట్రాక్‌పై నిద్రించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తాంబరం నుంచి సెంగోట్లైకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న యువకులపైకి దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మృతి చెందారు.
 
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రైలు ఢీకొన్న ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండుగకు వచ్చిన ముగ్గురు యువకులు పట్టాలపై పడుకుని రైలు ఢీకొని మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments