Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పూట ఉల్లిఘాటు... లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (09:33 IST)
మొన్నటివరకు టమోటా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక కేజీ టమోటాలు ఏకంగా రూ.400 వరకు పలికాయి. ఆ తర్వాత దిగుబడి పెరగడంతో టమోటా ధరలు క్రమంగా కిందకు దిగివచ్చాయి. ఇపుడు పండుగ వేళ ఉల్లిఘాటు నషాళానికి తాకుతుంది. వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. నిన్నామొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న వీటి ధరలు ఇపుడు మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసర ధరలు మరోమారు పెరుగిపోతున్నాయని సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఉల్లి సరఫరా అవుతుంటుంది. అయితే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 
 
మరోవైపు కొత్త దిగుబతి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోంది. విశాఖపట్నంలో కేజీ ఉల్లి రూ.50 పలుకుతోంది. ఇక రైతుబజార్లో రూ.40గా ఉంది. కర్ణాటకలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తుండడం కూడా ఒక కారణంగా ఉంది. కాగా కొత్త ఉల్లి నవంబర్ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరల ఘాటును సామాన్యులు భరించడం తప్పేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments