Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మం

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (12:19 IST)
తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మందిరమేనని తమిళ సర్కారు వెల్లడించింది. వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అన్బుసెల్వన్ తెలిపారు. 
 
అయితే జయలలితకు తాను పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. జయకు వారసులు లేరని ప్రకటించడంపై అన్బుసెల్వన్ మాట్లాడుతూ.. ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో అమృత వస్తే.. అప్పటికి వేదనిలయానికి వెల కట్టడం జరుగుతుందే కానీ.. వేదనిలయాన్ని అప్పగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంతేగాకుండా అమ్మకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments