Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది మందిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు.. రూ.4.5కోట్లు గుంజేశాడు

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (11:59 IST)
ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌.. విడాకులు తీసుకున్నవారు.. వితంతువులను లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిదేళ్లలో ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడాడు. 
 
కానీ చెన్నైలోని ఇందిరా గాంధీ (45) అనే లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి.. ఇందిరను పెళ్లాడిన మోహన్.. చెన్నైలోని ఆమె ఇంటిని రూ.1.5 కోట్లకు అమ్మేలా చేశాడు. 
 
ఆ డబ్బుతో కోవైలో ఇల్లు కొంటానని నమ్మబలికి డబ్బు గుంజేశాడు. ఆపై అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో మోహన్ ఎనిమిది మందిని వివాహం చేసుకున్నట్లు తేలింది. వారిని కూడా ఇందిరలా మోసం చేసి కోట్లు మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments