Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మం

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (12:19 IST)
తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మందిరమేనని తమిళ సర్కారు వెల్లడించింది. వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అన్బుసెల్వన్ తెలిపారు. 
 
అయితే జయలలితకు తాను పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. జయకు వారసులు లేరని ప్రకటించడంపై అన్బుసెల్వన్ మాట్లాడుతూ.. ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో అమృత వస్తే.. అప్పటికి వేదనిలయానికి వెల కట్టడం జరుగుతుందే కానీ.. వేదనిలయాన్ని అప్పగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంతేగాకుండా అమ్మకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments