Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (09:08 IST)
తనను బంధించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై ఓ పులి దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వండి పెరియార్ అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల అటవీ ప్రాంతం నుంచి ఓ పులి జనావాస ప్రాంతాల్లోకి వచ్చినట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దానికి మత్తు మందు ఇవ్వడానికి 15 మిటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. 
 
దీంతో అది ఒక్కసారిగా వారిపై దాడి చేసేందుకు పైకి దూకింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అటవీశాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్ళు ఉంటుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments