Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యపై భర్త కత్తితో దాడి... అడ్డుకున్న స్థానికులు (Video)

Advertiesment
knife
ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గంటాతోపు అనే గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై భర్త కత్తితో దాడి చేశారు. ఈ దాడిని గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. రైల్వే కోడూరు చెందిన లక్ష్మిప్రియని శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి సంసారంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. 
 
పుట్టింటి నుంచి కట్నకానుకలు తీసుకునిరావాలంటూ భర్త హేమంత్ కొంతకాలంగా వేధించసాగాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మిప్రియపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన ప్రియను స్థానిక యువకులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత 
 
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు బీహార్‌కు చెందిన కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ కేసులో ఏ2గా ఉన్న బీహార్‌కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. 
 
తన భర్త ప్రణయ్ హత్య కేసులో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తన నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాగే, అతని భవిష్యత్‌ను కాపాడుకోవడానికి తాను మీడియా ముందు కనిపించడం లేదని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. అందువల్ల శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకుని గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్టు ఆమె రాసుకొచ్చారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది