Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిలవని పేరంటానికి వచ్చారు.. పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు

Madhya pradesh
Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:01 IST)
పెళ్లికి పిలవలేదనే కోపంతో ముగ్గురు యువకులు పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిలారా అనే గ్రామంలో షేర్ సింగ్ కుహ్వాహా మేనల్లుడి పెళ్లి జరుగుతోంది. ఆ వివాహానికి గ్రామంలోని అందరినీ ఆహ్వానించారు. కానీ, హరేంద్ర సింగ్, బాలి, గుడ్డు రానాలను మాత్రం ఆహ్వానించలేదు. ఆ ముగ్గురు ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో నిషాలో తూగుతూ ఉండడంతో వారిని పెళ్లికి పిలవలేదు. 
 
అయితే తమను పెళ్లికి పిలవకపోయినా ఆ ముగ్గురు గత మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పిలవని పేరంటానికి వచ్చినా కూడా పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఎవరూ వారిని ఏమీ అనకుండా స్వాగతించారు. పెళ్లికి హాజరైన ఆ ముగ్గురు భోజనం పూర్తయ్యాక తమతో తెచ్చుకున్న గన్‌తో పెళ్లికొడుకు మేనమామ మీద కాల్పులు జరిపారు. 
 
హరేంద్ర సింగ్ రానా గన్‌తో కాల్పులు జరుపుతుంటే, మిగిలిన ఇద్దరూ పక్కనే ఉన్నారు. కాల్పులు అనంతరం వారంతా పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments