Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిలవని పేరంటానికి వచ్చారు.. పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:01 IST)
పెళ్లికి పిలవలేదనే కోపంతో ముగ్గురు యువకులు పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిలారా అనే గ్రామంలో షేర్ సింగ్ కుహ్వాహా మేనల్లుడి పెళ్లి జరుగుతోంది. ఆ వివాహానికి గ్రామంలోని అందరినీ ఆహ్వానించారు. కానీ, హరేంద్ర సింగ్, బాలి, గుడ్డు రానాలను మాత్రం ఆహ్వానించలేదు. ఆ ముగ్గురు ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో నిషాలో తూగుతూ ఉండడంతో వారిని పెళ్లికి పిలవలేదు. 
 
అయితే తమను పెళ్లికి పిలవకపోయినా ఆ ముగ్గురు గత మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పిలవని పేరంటానికి వచ్చినా కూడా పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఎవరూ వారిని ఏమీ అనకుండా స్వాగతించారు. పెళ్లికి హాజరైన ఆ ముగ్గురు భోజనం పూర్తయ్యాక తమతో తెచ్చుకున్న గన్‌తో పెళ్లికొడుకు మేనమామ మీద కాల్పులు జరిపారు. 
 
హరేంద్ర సింగ్ రానా గన్‌తో కాల్పులు జరుపుతుంటే, మిగిలిన ఇద్దరూ పక్కనే ఉన్నారు. కాల్పులు అనంతరం వారంతా పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments