Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:26 IST)
మహారాష్ట్రలో ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) వణికిస్తుంది. జీబీఎస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నయి. ఈ సిండ్రోమ్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీనికి కారణమే శనివారం కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జీబీఎస్ కేసుల సంఖ్య మొత్తం 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 యేళ్ల వృద్ధురాలికి జీబీఎస్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా నీటి శాంపిల్స్‌ను పరీక్షించడంతో శనివారం మరో రెండు నీటి వనరులు కలుషితమైనట్టు తెలిపింది. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఈ సిండ్రోమ్ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు స్థానికులకు ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ఈ సిండ్రోమ్ సోకిన వారికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు రావడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 
 
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం