Webdunia - Bharat's app for daily news and videos

Install App

తబ్లిగీ జమాత్ వ్యవహారంపై సీబీ'ఐ' అవసరం లేదు: కేంద్రం

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (20:14 IST)
తబ్లిగీ జమాత్ పై ఇన్నాళ్లూ రకరకా ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

తబ్లిగీ జమాత్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణలో భాగంగా కేంద్రం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాము భావించడం లేదని స్పష్టం చేసింది. 
 
చట్టాన్ని అనుసరించి, రోజువారీ విధానంలో దర్యాప్తు జరుగుతోందని, నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కీలక దశలో ఉందని కేంద్రం వివరించింది.

నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దర్యాప్తు పూర్తవుతుందని భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ జోక్యం అవసరంలేదని అనుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments