Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ర్యాలీ: రేవంత్

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (13:21 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు 'భారత్​ బచావో​' పేరిట నేడు దిల్లీలోని రాం​లీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకే ర్యాలీ చేపడుతున్నట్లు రేవంత్​రెడ్డి తెలిపారు.

రాష్ట్రం నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు దిల్లీ వెళ్లినట్లు పేర్కొన్నారు. మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మోదీ దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

నోట్ల రద్దు వికటించి ఆర్థిక పరిస్థితి మందగించిందని.. సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ రాచరిక పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ దోపిడీ ఆపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు మాత్రమే శ్రీమంతులు అయ్యారని.. రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments