Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కోటి రూపాయలకు ఇడ్లీ తిన్నారా? ఏంటయ్యా ఇది..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (15:44 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఇప్పటికే జయ మరణంపై ఆర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మరణంలో తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, అపోలో ఆసుపత్రి, అప్పటి చీఫ్ సెక్రటరీ రామమోహన్‌రావు కుట్ర పన్నారని కమిటీ ఆరోపించింది. 
 
రాధాకృష్ణన్ కమిషన్ ముందు భిన్న వాదనలు వినిపించారని, జయలలితను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా అంగీకరించలేదని కమిషన్ అడ్వొకేట్ మహ్మద్ జఫారుల్లా ఖాన్ ఆరోపించారు. కమిషన్ ఆరోపణల నేపథ్యంలో జయలలిత మృతిపై పలు అనుమానాలున్నాయని.. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, రామ్మోహన్ రావులను విచారించాలని న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన అపోలో ఆస్పత్రిని పిక్నిక్ స్పాట్‌గా మార్చి.. కోటి రూపాయలకు ఇడ్లీలను తిన్నదెవరు అంటూ ప్రశ్నించారు. 
 
జయలలిత హృద్రోగ సమస్యకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించి వుంటే.. ఆమెను కాపాడివుండొచ్చు. కానీ జయకు యాంజియోగ్రామ్ చేయకూడదని ఎవరు చెప్పారని అడిగారు. అలాగే విదేశాలకు పంపి అమ్మకు చికిత్స అందించే సౌకర్యం వున్నప్పటికీ ఆమెను అక్కడకు తరలించని కారణం ఏమిటని అడిగారు. అందుచేత ఓ స్పెషల్ కమిషన్‌తో అమ్మ మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ కమిషన్ వుండాలని షణ్ముగం డిమాండ్ చేశారు. జయలలిత మృతికి ఆమె నెచ్చెలి శశికళకు కూడా సంబంధం వున్నట్లు షణ్ముగం ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments