Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వాదించలేక నాలుక కోసేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (09:45 IST)
సహజంగా ఆడవారిపైనే వేధింపులు ఎక్కువ నమోదవుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపులు తాళలేని ఆ భర్త ఏకంగా నాలుక కోసేసుకున్నాడు. ఈ ఘటన కాన్పూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిషా, ముఖేష్ అనే భార్యాభర్తలు. ఐతే ఈమధ్య కాలంలో భర్తతో నిషా తరచూ గొడవపడుతోంది. భర్త ఎంత సర్దుకు పోదామని చూస్తున్నా ఆమె అతడిపై రేగు కంపలా పడుతోంది. తిట్ల పురాణం అందుకుంటోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లడంతో నిషా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంతకీ రాకపోయేసరికి ముఖేష్ తనే తలొగ్గి భార్యకు ఫోన్ చేసాడు. కలిసి వుందామనీ, గొడవలు వద్దని నచ్చజెప్పాడు. ఐతే ఆమె ఆ సందర్భంలో కూడా గయ్యమంటూ గొడవకు దిగింది. దీనితో ఆమెతో వాదించలేని భర్త బ్లేడుతో తన నాలుకను కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments