Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో తొలి జికా వైరస్‌ కేసు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:22 IST)
కేరళలో తొలిసారిగా జికా వైరస్‌ కేసు వెలుగు చూసింది. 24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని, వాటికి సంబంధించి పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

‘‘తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్‌కు వెళ్లాయి. వారిలో వైద్యులు సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు.

ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్‌ 28న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. రాష్ట్రం వెలుపలికి ఆమె ప్రయాణించలేదు. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది.

వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జికా వ్యాధి లక్షణాలు కూడా డెంగీ తరహాలోనే ఉంటాయి. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments