Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో తొలి జికా వైరస్‌ కేసు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:22 IST)
కేరళలో తొలిసారిగా జికా వైరస్‌ కేసు వెలుగు చూసింది. 24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని, వాటికి సంబంధించి పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

‘‘తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్‌కు వెళ్లాయి. వారిలో వైద్యులు సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు.

ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్‌ 28న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. రాష్ట్రం వెలుపలికి ఆమె ప్రయాణించలేదు. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది.

వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జికా వ్యాధి లక్షణాలు కూడా డెంగీ తరహాలోనే ఉంటాయి. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments