Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం: శవాల మీద దుస్తులూ వదలట్లేదు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (14:44 IST)
బాగ్‌పట్‌ (యూపీ): కరోనా రోగుల నుంచి వైద్యం పేరిట ఆసుపత్రులు దోచుకోవడం చూశాం. కొన్నిచోట్ల బాధితుల ఆభరణాలు మాయమైన ఘటనల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాది కొత్త దందా! కరోనాతో మరణించిన వారి దుస్తులు దొంగిలించడం, వాటిని ఉతికి మళ్లీ విక్రయించడం వీరి పని! ఈ విధంగా శ్మశానవాటికల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను యూపీలోని బాగ్‌పట్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.
 
కొవిడ్‌ మృతదేహాలపై కప్పిన ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి మొత్తం 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలా చోరీ దుస్తులను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి కొత్త లేబుళ్లు వేసి విక్రయిస్తున్నారని చెప్పారు.

స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్‌ కుదుర్చుకుని, వారికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అరెస్టయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో ఇంకెన్ని దారుణాలు చూడాలో!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments