Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్..చుక్ కూత ఇక వినిపించదు..

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:51 IST)
150 ఏళ్ల క్రితం మెుదలై ఆ శత చక్ర వాహక ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న చుక్.. చుక్ రైలు ఎంతో మందిని గమ్యస్థానానికి చేరుస్తూ తన ప్రయాణాన్ని సుధీర్ఘకాలంగా కొనసాగిస్తోంది.

చుక్..చుక్ రైలు వస్తుంది.. పక్కకు పక్కకు జరగండి అంటూ తనతో మనకు మెుదటి పరిచయం మెుదలవుతుంది. రైలు అనగానే మనకు గుర్తొచ్చేది దాని కూతే. అయితే ఆ కూత ఇక వినిపించదంటా!… చుక్ చుక్ కూత ఇక చరిత్ర గర్భంలో కలసిపోనున్నది.
 
డిసెంబర్‌ నెల కల్లా రైళ్ల శబ్ధంలో మార్పులు రానున్నాయి. కి,మీ వరకు నేను వస్తున్నానంటూ చెప్పే ఆ పిలుపు ఇక వినిపించదు. బిగ్గరగా అరవకుండా అతి తక్కువ శబ్దంతో రైలు ప్రయాణం సాగనుంది. డీజిల్ ఇంజన్‌లకు ఉన్న కార్స్‌ని తొలగించి  విద్యుత్ సరఫరా ద్వారా శబ్ధం వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రస్తుతం పవర్ కార్స్ 105 డెసిబిల్స్ శబ్దం చేస్తుండగా ఇక నుంచి అలాంటి సౌండ్‌కు ఆస్కారం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. వీటి స్థానంలో సైలెంట్ మోడ్స్‌ను ఫిక్స్ చేస్తామని రైల్వే బోర్డు అధికారి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఈ సైలెంట్ మోడ్‌ వల్ల రూ.800 కోట్ల విద్యుత్‌ను ఆదా అవుతుందన్నారు. ఇంతకు ముందే ఈ టెక్నాలజీని ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రవేశపెట్టామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments