శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (20:38 IST)
రాజకీయ కారణాలతోశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తనపై దాడి చేశారంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది. ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలవగా... కేసు విచారణను నవంబర్​ 14న విస్తృత ధర్మాసనానికి అప్పగించింది న్యాయస్థానం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments