Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (20:38 IST)
రాజకీయ కారణాలతోశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తనపై దాడి చేశారంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది. ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలవగా... కేసు విచారణను నవంబర్​ 14న విస్తృత ధర్మాసనానికి అప్పగించింది న్యాయస్థానం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments