Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్ కమాండర్ అబ్రార్‌ను హతమార్చిన భారత్ భద్రతా బలగాలు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (08:25 IST)
పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా అగ్ర కమాండర్ అబ్రార్‌ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. శ్రీనగర్ సమీపంలోని మాలోరా పరింపోరాలో జరిగిన ఎన్‌కౌంటరులో అబ్రార్‌ను చంపేశాయి. 
 
ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ విచారణలో భాగంగా, అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్న జవాన్లు సోమవారం రాత్రి అతను ఏకే-47 రైఫిల్‌ను దాచిన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆయుధాన్ని రికవరీ చేస్తున్న క్రమంలో అబ్రార్ అనుచరుడు తిరగబడి, జవాన్లపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ అనివార్యమైందని వివరించారు. 
 
ఆ ఇంట్లో ఉన్న ఓ విదేశీ ఉగ్రవాది జవాన్లను చూసి, లోపలి నుంచి కాల్పులు ప్రారంభించాడని, అబ్రార్ కూడా తిరగబడ్డాడని, ఆపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ మరణించారని, ఆ ఇంటి నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ వెల్లడించారు.
 
విదేశీ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించిన అనంతరం ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయని, ఆ వెంటనే రాష్ట్ర పోలీసులతో పాటు అదనపు బలగాలను రప్పించి, ఇంటిని చుట్టుముట్టామని అన్నారు. 
 
గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హతులైన ఇద్దరు ఉగ్రవాదులూ, గతంలో ఎన్నో దాడులు చేశారని అన్నారు. శ్రీనగర్ హైవేపై జరిగిన బాంబు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments