Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (15:29 IST)
Dead Body
పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో  పోస్టుమార్టం వద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెందాడని తెలుసుకుని బోరుమంది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. 
 
అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహన్ని భుజంపై వేసుకుని మలయ్య గుండెపోటుతో చనిపోయాడని.. ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదంటూ పరుగులు తీశాడు. కానీ పోలీసులు అతడిని వెంబడించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments