Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతుకు దుబాయ్‌లో లాటరీ తగిలింది.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:36 IST)
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు. అంతే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ రైతు లాటరీతో కోటీశ్వరుడు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 
 
అయితే ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం వెతికాడు కానీ ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది అతనికి. 
 
సొంతూరికి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపించాడు. అలా లాటరీ టిక్కెట్లు కొనేలా చేశాడు.
 
అయితే ఆ లాటరీ ద్వారానే ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ లాటరీ టికెట్‌కే కోట్లు తగిలాయి. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.29 కోట్ల నగదు బహుమతి లభించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments