Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యాలను వదిలిన బూత్ బంగళా ఇచ్చారు : లాలూ తనయుడు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:51 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టారనీ, అందుకే ఆ బంగళాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్నప్పుడు దేశ్‌రత్న్‌ మార్గ్‌లోని భవనాన్ని కేటాయించారు. ఆది నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై గట్టి నమ్మకం ఉన్న తేజ్‌ ఆ బంగ్లాను తన సెంటిమెంట్‌గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా ప్రధాన ద్వారం మూసేసి, పలు మార్పులు కూడా చేయించారు. 
 
కానీ మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్‌ప్రతా్‌పకు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయినా బంగ్లాను ఖాళీ చేయని తేజ్‌.. పాట్నా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా ఆయన ఆ బంగళాను ఖాళీ చేశారు. 'సీఎం నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ నా ఇంట్లో దెయ్యాలను వదిలారు. అవి నన్ను వేధిస్తున్నాయి. అందుకే బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments