రైలు ఇంజిన్ పైకెక్కి సెల్ఫీ దిగపోయిన బాలుడు.. విద్యుత్ షాక్‌తో..?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (18:33 IST)
రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు ఇంజిన్ పైకెక్కి సెల్ఫీ దిగపోయిన ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు పౌరసరఫరాల శాఖలో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. గురువారం తన 14 ఏళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్‌ను తనతోపాటు విధులకు తీసుకెళ్లాడు. అతను రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అతని కుమారుడు జ్ఞానేశ్వర్‌ సెల్ఫీ తీసుకునేందుకు ఆగి ఉన్న రైల్ ఇంజన్ పైకి ఎక్కాడు.
 
అయితే, రైల్ ఇంజన్ పైననే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్ వైర్‌లను గమనించకుండా జ్ఞానేశ్వర్ సెల్ఫీ కోసం చేయి పైకి లేపడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీకి పంపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments