Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లై ఏడేళ్లయినా ప్రియుడిని వదల్లేకపోయిన ప్రియురాలు, అతడితో కలిసి...

పెళ్లై ఏడేళ్లయినా ప్రియుడిని వదల్లేకపోయిన ప్రియురాలు, అతడితో కలిసి...
, సోమవారం, 16 నవంబరు 2020 (12:06 IST)
ఆమెకి పెళ్లయింది. ఐతే అంతకంటే రెండేళ్ల ముందు నుంచే ఓ యువకుడితో ప్రేమలో మునిగిపోయి వుంది. ఇద్దరి మధ్య శారరీక సంబంధం కూడా సాగుతోంది. పెళ్లయినా ప్రియుడిని కలుస్తూనే వుంది. తనకు ఐదేళ్ల కుమార్తె వున్నప్పటికీ తన భర్త, కుమార్తెను పక్కనపెట్టి ప్రియుడి తోటిదే లోకంగా గడుపుతూ వచ్చింది.
 
ఐతే శనివారం వీళ్లిద్దరూ నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంచీరేవుల గ్రామంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు సంపత్, వివాహిత పార్వతి పురుగుమందులతో కలిపిన కూల్‌డ్రింక్‌ తాగారు. ఐతే పురుగుమందు తాగిన వెంటనే సంపత్ ప్రాణభయంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి తమను బ్రతికించాలని కోరాడు. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఇద్దరూ చనిపోయారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంపత్, పార్వతి గత తొమ్మిదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల క్రిందట యాదగిరిని వివాహం చేసుకోవలసి వచ్చింది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఐతే వివాహం తర్వాత కూడా పార్వతి సంపత్‌ను తరచూ కలుసుకునేది. నవంబర్ 6న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.
 
తన భార్య ఎక్కడికి వెళ్లిందో జాడ తెలీకపోవడంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి మంచిరేవుల గ్రామంలో ఆమె శవమై కనిపించింది. ఈ మహిళ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బుంటే చాలు.. ఇక రాకెట్ ప్రయాణం కూడా ఈజీ.. ప్రయోగం సక్సెస్