Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడికే భర్త నుంచి అప్పు తీసిచ్చిన భార్య, అది కాస్తా బయటపడటంతో...

ప్రియుడికే భర్త నుంచి అప్పు తీసిచ్చిన భార్య, అది కాస్తా బయటపడటంతో...
, శనివారం, 14 నవంబరు 2020 (10:11 IST)
ఏవండీ.. మా బంధువు ఆయన. మన ఊర్లో రైస్ మిల్లు పెడుతున్నాడు. మన సహాయం కావాలి. మీరు అప్పు ఇస్తే రైస్ మిల్లు పెట్టుకుని బాగా నిలదొక్కుకుంటాడు. మన డబ్బు మనకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాడని భార్య చెప్పింది. భార్యే అంతగా చెబుతోందని డబ్బులిచ్చాడు. కానీ ఆ డబ్బులివ్వలేదు సరికదా డబ్బులు తీసుకున్న వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం నడుపుతోందని తెలుసుకుని షాకయ్యాడు భర్త.
 
తెలంగాణా రాష్ట్రం సిద్ధిపేట వివేకానంద ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రాజేశ్వరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక్కడే స్థిరపడింది శ్రీనివాస్ కుటుంబం. రాజేశ్వరి స్వగ్రామం సమీపంలోని దుద్దెడ. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. 
 
అయితే సరిగ్గా నెల క్రితం ఆ ప్రాంతానికి రాజు అనే వ్యక్తి వచ్చాడు. రాజేశ్వరి బంధువే. వరుసకు బావ. అసలు రాజేశ్వరిని ముందుగా రాజుకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు. కానీ ఆస్తి లేకపోవడంతో శ్రీనివాస్‌తో పెళ్ళి జరిగింది. రాజేశ్వరి, రాజుల మధ్య గతంలోనే ప్రేమాయణం సాగింది.
 
శ్రీనివాస్ అప్పు ఇస్తున్నాడని తెలుసుకున్న రాజు తనకు పరిచయమైన రాజేశ్వరిని రిక్వెస్ట్ చేశాడు. తాను మీ గ్రామంలోనే రైసు మిల్లు పెడతానని... కాస్త డబ్బులు తీసివ్వమని కోరాడు. డబ్బు కోసం రాజేశ్వరి చుట్టూ పదేపదే తిరిగేవాడు. 
 
ఇలా తిరగడంతో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రాజేశ్వరి భర్తకు నచ్చచెప్పి డబ్బులు తీసిచ్చింది. అయితే రైస్ మిల్లు పెట్టిన రాజు డబ్బులివ్వడంలో ఆలస్యం చూపించాడు. దీంతో  పాటు తన భార్య రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనివాస్‌కు తెలిసింది. 
 
దీంతో ఆమెను మందలించాడు. భర్త మందలింపుతో భయటపడిన రాజేశ్వరి రాజుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. సుపారీ ఇచ్చి శ్రీనివాస్‌ను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు రాజు, రాజేశ్వరి. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి కటాకటాల పాలయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 1050 పాజిటివ్‌ కేసులు