పెళ్లయిన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (09:53 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వివాహమైన మాజీ ప్రియుడిని ఓ యువతి తన తల్లిదండ్రుల సాయంతో కిడ్నాప్ చేసి ఓ గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకుంది. తన మాజీ ప్రియుడిని మరిచిపోలేనని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా కుమార్తెకు సహకరించి, మాజీ ప్రియుడిన కిడ్నాప్ చేసేందుకు సహకరించారు. అయితే, వివాహితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. 
 
చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తీబన్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కాలేజీ చదువుకునే రోజుల్లో వేలూరు జిల్లా రాణిపేటకు చెందిన సౌందర్య అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ ఏడేళ్లపాటు కొనసాగింది. అయితే, వారి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ఈ క్రమంలో పార్తీబన్ గత నెల 5వ తేదీన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన మాజీ ప్రియురాలు తట్టుకోలేపోయింది. తన మాజీ ప్రియుడిని మర్చిపోలేక పోతున్నానని, అతనితో తన వివాహం జరిపించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసింది. దీంతో యువతి తల్లి ఉమ, ఆమె బంధువులు రమేష్, శివకుమార్‌ల సాయంతో శుక్రవారం పార్తీబన్‌ను కిడ్నాప్ చేసింది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా, అతన్ని బలవంతంగా అపహరించి కారులో కాంచీపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆలయంలో అతనితో సౌందర్య మెడలో తాళి కట్టించారు.
 
అయితే, తన భర్త పార్తీబన్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెర ఫుటేజీ ఆధారంగా నిందితురాలు గుర్తించిన పోలీసులు యువతితో పాటు ఆమె తల్లి, అపహరణతో ప్రేమేయం ఉన్న ఇతర బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments