చెడు తిరుగుళ్లు వద్దని చెప్పినందుకు.. భర్తను కాల్చి చంపిన భార్య!!

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (08:06 IST)
చెడు తిరుగుళ్లు వద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. తన ప్రియుడుతో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలోని పోతకుట్ట అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోతకుట్ట గ్రామానికి చెందిన గోవిందరాజ్‌ (53) అనే వ్యక్తి దర్జీగా పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ జయంతిపురంలో స్పృహ కోల్పోయి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని ఆంబులెన్స్‌లో సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. గోవిందరాజ్ భార్య కాంచన, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తేలిందని పోలీసులు తెలిపారు. 
 
కాంచన (40)కు అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి(22)తో వివాహేతర సంబంధ ఏర్పడిందని, ఈ విషయం తెలుసుకున్న గోవిందరాజ్‌ భార్యను మందలించాడన్నారు. దీంతో ఆమె భర్తను హత మార్చేందుకు పథకం వేసిందని పోలీసులు తెలిపారు. 
 
కుప్పుస్వామి, ఆయన మిత్రులు ముగ్గురు కడంబూర్‌కు వెళ్లి నడికరువర్‌కు చెందిన ముత్తయ్య అనే వ్యక్తికి రూ.లక్ష అందజేసి నాటు తుపాకీ కొనుగోలు చేశారు. 
 
గత 4వ తేదీ రాత్రి 10 గంటలకు జయచంద్రపురంలో నడచి వెళుతున్న గోవిందరాజ్‌ను కుప్పుస్వామి తుపాకీతో కాల్చగా తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. ఈ కేసులో కాంచన, కుప్పుస్వామి, ముత్తయ్య సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments