Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి రక్షణ : చచ్చిన పామును ఆరగించిన రైతు కూలీ

Webdunia
ఆదివారం, 30 మే 2021 (15:58 IST)
గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బాధితులుగా ఉన్నారు. 
 
ఈ వైరస్ స్వైర విహారం దెబ్బకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిపై అపోహలు ఉన్నాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కరోనా నుంచి రక్షణ కలిగిస్తుందంటూ చచ్చినపామును తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అతడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు ఓ రైతు కూలీ. ఇటీవల వడివేలు ఓ చచ్చినపామును తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పామును తింటే కరోనా రాదని వడివేలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. 
 
కరోనా నుంచి రక్షణ కోసమే పామును చంపి తింటున్నానని అతడు వివరించాడు. అయితే ఈ వీడియో స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వడివేలును అరెస్ట్ చేశారు. అతడికి ఏడు వేల రూపాయలు జరిమానాగా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments