Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిచిన పాముతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:47 IST)
తనను కరిచిన పామును పట్టుకుని ఓ వృద్ధుడు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. వృద్ధుడి చేతిలో పామును చూసిన ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్ కుప్పంలో రంగనాథన్ అనే వృద్ధుడు నివశిస్తున్నాడు. ఈయన రోజువారిలాగే తన పొలంలో పని చేసుకుంటుండగా, ఆయన కాలుకు పాము కాటువేసింది.
 
పాము కరిచిందన్న భయం ఏమాత్రం లేకుండా, ఆ పామును చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అపుడు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు.. ఈ పామును చూసి కేకలు వేస్తూ భయానికి లోనై పారిపోయారు. ఆ తర్వాత ఈ పామును చూసిన వైద్యులు కూడా షాక్‌కు గురయ్యారు. 
 
కానీ, రంగనాథన్ మాత్రం దీనిపై మాట్లాడుతూ, తనను కాటేసిన పాము మంచిదే అయినప్పటికీ.. విషం మాత్రం చాలా ప్రమాదమని తెలిసే దాన్ని పట్టుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత రంగనాథన్‌కు వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళుతూ ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments