Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిచిన పాముతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:47 IST)
తనను కరిచిన పామును పట్టుకుని ఓ వృద్ధుడు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. వృద్ధుడి చేతిలో పామును చూసిన ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్ కుప్పంలో రంగనాథన్ అనే వృద్ధుడు నివశిస్తున్నాడు. ఈయన రోజువారిలాగే తన పొలంలో పని చేసుకుంటుండగా, ఆయన కాలుకు పాము కాటువేసింది.
 
పాము కరిచిందన్న భయం ఏమాత్రం లేకుండా, ఆ పామును చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అపుడు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు.. ఈ పామును చూసి కేకలు వేస్తూ భయానికి లోనై పారిపోయారు. ఆ తర్వాత ఈ పామును చూసిన వైద్యులు కూడా షాక్‌కు గురయ్యారు. 
 
కానీ, రంగనాథన్ మాత్రం దీనిపై మాట్లాడుతూ, తనను కాటేసిన పాము మంచిదే అయినప్పటికీ.. విషం మాత్రం చాలా ప్రమాదమని తెలిసే దాన్ని పట్టుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత రంగనాథన్‌కు వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళుతూ ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments