Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిచిన పాముతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:47 IST)
తనను కరిచిన పామును పట్టుకుని ఓ వృద్ధుడు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. వృద్ధుడి చేతిలో పామును చూసిన ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్ కుప్పంలో రంగనాథన్ అనే వృద్ధుడు నివశిస్తున్నాడు. ఈయన రోజువారిలాగే తన పొలంలో పని చేసుకుంటుండగా, ఆయన కాలుకు పాము కాటువేసింది.
 
పాము కరిచిందన్న భయం ఏమాత్రం లేకుండా, ఆ పామును చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అపుడు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు.. ఈ పామును చూసి కేకలు వేస్తూ భయానికి లోనై పారిపోయారు. ఆ తర్వాత ఈ పామును చూసిన వైద్యులు కూడా షాక్‌కు గురయ్యారు. 
 
కానీ, రంగనాథన్ మాత్రం దీనిపై మాట్లాడుతూ, తనను కాటేసిన పాము మంచిదే అయినప్పటికీ.. విషం మాత్రం చాలా ప్రమాదమని తెలిసే దాన్ని పట్టుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత రంగనాథన్‌కు వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళుతూ ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments